ఉపకార వేతనాలు వినియోగించుకొని ఉన్నత విద్యతో సమాజానికి ఉపయోగపడాలి: పోతిన వెంకట మహేష్

శ్రీ నగరాలు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిట్టి నగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమ్యూనిటీ హాల్ నందు జరిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పోతిన వెంకట మహేష్. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా లింగిపిల్ల రామకృష్ణ, కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రముఖ న్యాయవాది పిల్ల రవి వ్యవహరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సామాజికవర్గంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అందజేస్తున్న ఉపకారవేతనాలు ఎంతగానో దోహదపడుతు ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నారని, విద్యార్థులందరూ ఉపకార వేతనాలు వినియోగించుకొని ఉన్నత చదువుకొని సమాజానికి మరియు సామాజికవర్గానికి ఉపయోగపడాలని, వృద్ధులకు అందజేస్తున్న పెన్షన్, చీర మరియు దుప్పట్లు వీరందరూ సంక్రాంతి కానుకగా భావించాలని, సామాజికవర్గంలోని అందరూ ఐకమత్యంగా ఉంటే అన్ని సాధించుకోవచ్చని, 4 సంవత్సరాలుగా నన్ను అందరూ ఆశీర్వదిస్తూ గుండెల్లో పెట్టుకున్నారని, రాబోయే రోజుల్లో ఇదే రీతిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి బలంగా ముందుకు నడిపించాలని కోరారు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎంతగానో సామాజికవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయని రాబోయే రోజుల్లో ఈ ట్రస్టు ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ మరియు డాక్టర్ కోర్సులు చదివే మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే స్థాయికి ఎదగాలని అందుకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేశారు.