బొలియశెట్టి శ్రీకాంత్ ను సన్మానించిన తురువూరు జనసేన

తిరువూరు నియోజకవర్గం, జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు విస్సన్నపేట జనసేనపార్టీ సమావేశంలో ఉమ్మడి కృష్ణజిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ కి గంపాలగూడెం మండల అధ్యక్షులు వెంకటకృష్ణ, తిరువూరు మండల అధ్యక్షులు పుల్లారావు, విస్సన్నపేట మండల అధ్యక్షులు షేక్ యాసిన్, ఏ కొండూరు మండల అధ్యక్షులు విజయ్ కుమార్ సన్మానించారు. బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ… ఉమ్మడి కృష్ణజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ నామీద నమ్మకంతో తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు నియోజకవర్గాల మండల కమిటీ బాధ్యతలు అప్పగించిన దగ్గర నుండి పార్టీ కోసం ఆత్మవిశ్వాసంతో పని చేసానని, అందరితో పాటు మంచిగా ఉంటూ జిల్లా కార్యవర్గం, మండల నాయకులు చెప్పే విషయాలు చర్చించి మండల నాయకులతో జిల్లా కార్యవర్గంతో ముందుకు వెళ్ళాము కమిటీలు వేశాం. జిల్లా కార్యవర్గం, మండల నాయకులు కృషి వల్ల నందిగామ, తిరువూరు నూజివీడు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేనపార్టీ చేరికాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణకి, జిల్లా కార్యవర్గానికి, నందిగామ పూజారి రాజేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.