వడ్రాణం నాగేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలి

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు గారి తండ్రి వడ్రాణం నాగేశ్వరరావు గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులైన నాగేశ్వర రావు గారు గుంటూరు జిల్లాలో ఖో ఖో క్రీడ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మార్కండేయ బాబు గారు.. ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.