కిమ్మి గ్రామంలో వజ్రగడ జానీ పర్యటన

పార్వతీపురం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరగట్టం మండలం, కిమ్మి గ్రామంలో వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ జానీ పర్యటించడం జరిగింది. కిమ్మి జనసైనికుల ద్వారా గ్రామ పరిస్థితితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కిమ్మి గ్రామంలో కాలువలుశుభ్రం చెయ్యక ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారు అని తెలుసుకోవడం జరిగింది. జగన్ రెడ్డి గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని పేరుకి మాత్రమే చెప్పి.. చెత్త పన్నులు వసూలు చేస్తూ.. కనీసం శివాలయం ప్రాంగణంలో కూడా పరిశుభ్రత చేయించడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ రావాలి పాలన మారాలి అని నినాదాలు చేస్తూ.. జనసేన భలోపేతం కు అందరూ కష్టపడాలి అని తెలియజేశారు.