పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 19వ రోజు

  • మంగనుర్ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం, మంగనుర్ గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ గురువారం పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, హారి నాయక్, బోట్క రమేష్, బోనాస్ శివ, నరేష్, సూర్య, రాజు నాయక్, వంశీ రెడ్డి, బాలకృష్ణ, చంద్ర శేఖర్, మహేష్, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.

• గౌరారం గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

గురువారం సాయంత్రం బిజినపల్లి మండలం, గౌరారం గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు హారి నాయక్, బోట్క రమేష్, బోనాస్ శివ, సూర్య, లింగం నాయక్, వంశీ రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.