*జనసేన నేతల ఘనమైన పాల్గొనింపు
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేటలో ఆదివారం పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, విజయవాడ పులిబిడ్డ వంగవీటి మోహనరంగారావు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త యర్రంశెట్టి రామకృష్ణ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వక్తలు వంగవీటి మోహనరంగారావు త్యాగాలను, సామాజిక న్యాయ పోరాటాలను స్మరించుకుంటూ, వారి ఆత్మవిశ్వాసాన్ని భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేలా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనియాడారు. జనసేన నేతల సమూహ హాజరుతో, ప్రజల అపారమైన పాల్గొనితో ఈ కార్యక్రమం అచ్చంపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Share this content:
Post Comment