వారాహి యాత్రతో వైసీపీ పాలనకు సంకెళ్లు: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు నియోజకవర్గం: రైల్వే కోడూరు జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ వారాహి యాత్ర పోస్టర్లు ను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భముగా రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ.. వారాహితో వైసీపీ పాలనకు కచ్చితంగా సంకెళ్లు పడతాయని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా అభివృద్ధి చూస్తుంటే మీలాంటి పాలన సిగ్గుచేటుగా ఉందని 2024లో ప్రజల్లో మీకు కచ్చితంగా బుద్ధి చెప్తారని మీరు ముఖ్యమంత్రి అయ్యాక కడప అభివృద్ధి ముందుకెళ్లడం ఏమోగానీ 10 ఏండ్లు వెనక్కి వెళ్లిందని తెలియజేశారు. జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి మాట్లాడుతూ.. ఎక్కడుంది మీ వారాహి అన్న మీకు గుండెల్లో గుబులు పుట్టేలా వారాహి యాత్ర 14వ తారీఖున మొదలవుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మీ సొంత జిల్లా అయినటువంటి కడపలోనే అభివృద్ధి చేయలేని అసమర్ధులు మీరని ప్రజలు చెప్తున్నారు. ప్రజల మనిషి ఎవరో తెలుసుకోండి. ఈ నాలుగు ఏళ్ల వైసిపి పాలనలో కడపకు ఎటువంటి అభివృద్ధి చేశారు మీరు అని గట్టిగా ప్రశ్నించారు. మీరు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే, ఏవైనా దాఖలాలు ఉంటే మేము ఈ నాలుగేళ్ల కాలంలో ఇది మేము తెచ్చాం ఈ పరిశ్రమ మేము తెచ్చామని చెప్పంది అని నాగేంద్ర గట్టిగా ప్రశ్నించారు.