వారాహి యాత్ర దిగ్విజయం కావాలి.. కోడూరు జనసేన
కోడూరు నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయం కావాలని కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం, రెడ్డి పల్లెలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో కోడూరు జనసేన నాయకుల ఆధ్వర్యంలో రాజంపేట మరియు కోడూరు జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధించి, రాష్ట్రంలో ఈ రాజరిక పరిపాలన నియంతృత్వ నాయకత్వం మారి ప్రజాస్వామ్య పరిరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తూ సరికొత్త నాయకత్వంతో ప్రజా ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేయాలని, వారాహి యాత్ర దిగ్విజయం కావాలని జనసేన పార్టీ నాయకులందరూ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు జనసేనకు ఉండాలని ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు జనసేన పార్టీ నాయకులు వర్ధన్న ప్రసాద్, దినకర్ బాబు, నల్లంశెట్టి కిషోర్, మహేష్, నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి వెంకటసుబ్బయ్య, లీగల్ సెల్ సభ్యులు ఆలం నాగభూషణం, ఎద్దల అనంత రాయల్, వివిధ మండలాల జన సైనికులు, కడప జిల్లా జనసేన పార్టీ లీగల్ ప్రెసిడెంట్ కరుణాకర్ రాజు, రాజంపేట నాయకులు ఎం వెంకటేశ్వరరావు, బాలసాయికృష్ణ, పోలిశెట్టి శ్రీనివాసులు, ప్రశాంత్ భారతాల, భాస్కర పంతులు, వీరయ్య ఆచారి, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-12.28.22-PM-1024x576.jpeg)