వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే వారాహి యాత్ర ఏకైక లక్ష్యం
- వారాహి యాత్రకు రోజు రోజుకీ విశేష స్పందన చేరుకుతుంది..
- పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య
ఆచంట: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రోజు రోజుకీ విశేష స్పందన చేరుకుతుందని పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య అన్నారు. తన యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులపై ఆయన తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని చెపుతున్నారు. వైసీపీని ఓడించడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేస్తామని అంటున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా వారహియాత్ర ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా ప్రవేశిస్తున్న తరుణంలో నర్సపురంలో జరగనున్న భారి బహిరంగ సభలో నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనాలని, యువత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-25-at-7.06.48-PM.jpeg)