వరప్రసాద్ సేవలు చిరస్మరణీయం

అనకాపల్లి, అశోక చక్ర అవార్డ్ గ్రహీత కరణం వర ప్రసాద్ సేవలు చిరస్మరణీయమని ఎంపి డాక్టర్ సత్యవతి పేర్కొన్నారు. అశోక చక్ర అవార్డ్ గ్రహీత అమరవీరుడు కరణం వర ప్రసాద్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తాసుబెల్లి ఫౌండేషన్, కరణం వర ప్రసాద్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యములో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వేల్పుల వీధి సీతా రామ కళ్యాణ మండపంలో జరుగు శిబిరంలో కంటి, గుండె, బిపి, షుగర్, ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. విశేష స్థాయిలో జనం పాల్గొన్నారు. అనంతరం వరప్రసాద్ జీవితానికి సంబంధించి పుస్తక ఆవిష్కరణను ఎంపీ సత్యవతి చేతుల మీదుగా ప్రారంబించారు. ఫౌండేషన్ ప్రతినిధులు కళావతి, చైతన్య, మురళి తదితరులు పాల్గొన్నారు.