వరికూటి నాగరాజుకి తృటిలో తప్పిన పెనుప్రమాదం
ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు శనివారం రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో పొదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ పెనుప్రమాదం నుండి వరికూటి నాగరాజు మరియు వారితో పాటు ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయట పడడం జరిగింది. ఈ ప్రమాదంలో వరికూటి నాగరాజు ప్రయాణిస్తున్న కారుకు భారీగా డ్యామేజ్ అవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-17-at-16.04.25-1-768x1024.jpeg)