జనసేన కార్యకర్తకు ఆర్థిక సహాయాన్ని అందించిన వరికూటి నాగరాజు

కనిగిరి నియోజకవర్గం: పామూరు మండల జనసేన పార్టీ కార్యకర్త, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి, పార్టీ కోసం, పార్టీ ఆశయాలకోసం నిరంతరం శ్రమించే వ్యక్తి బొందిల నారాయణ ఇటీవల అనారోగ్యం వలన ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు 10 రోజుల చికిత్స పొంది పామూరు స్వగృహనికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను శుక్రవారం కలిసి ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, జిల్లా అద్యక్షులు రియాజ్ సూచనమేరకు శనివారం సాయంత్రం పరామర్శించి వారికి 20000 రూపాయలు సత్వర ఆర్థిక సహాయాన్ని అందించారు. మరియు పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరు ఒకరికొకరు సహాయసహకారాలు చేసుకోవాలని, ఎటువంటి సమస్యలు ఉన్న నేనున్నాను అని భరోసాను కూడ ప్రతి కార్యకర్తకు ధైర్యాన్ని నాగరాజు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రహిముల్లా, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, మండల అధ్యక్షుడు ఏడుకొండలు, ప్రముఖ వ్యాపార వేత్త మాదాసు రమేష్, లాయర్ అనిల్, కుప్పాల శ్రీకాంత్, సునిల్, సత్యనారాయణ, వరికూటి నరసింహ, వరికూటి నారాయణ, వరికూటి అజయ్, వాసు, సందాని కార్యకర్తలు అందరూ పాల్గోన్నారు.