నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన వరికూటి యువత
కనిగిరి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రకాశం జిల్లా జనసేన లీగల్ సెల్ కార్యదర్శి వరకూటి నాగరాజు ఆదేశాల మేరకు పొదిలిలోని వరికూటి యూత్ ఆధ్వర్యంలో పొదిలి సర్కిల్లోని నూతనంగా నియమితులైన సిఐని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పొదిలిలో ఎటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు అయినా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తోట లోకేష్, మస్తాన్, గోవర్ధన్, కరిముల్లా, రాము పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-21.45.48-1024x461.jpeg)