నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన వాసగిరి మణికంఠ

మంగళగిరి: జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాద్యుడు వాసగిరి మణికంఠ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ నాదెండ్ల మనోహర్ దృష్టికి గుంతకల్ నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యల గురించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పరిణామాలపై అలాగే జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణపై గౌరవనీయులు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై అలాగే నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ బలంగా పనిచేయాలని దిశ నిర్దేశాన్ని అందించడం జరిగినది, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని వారి సేవలకు అనుగుణంగా పార్టీలో వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని నాయకుడు ఒక గొప్ప ఆశయం కోసం ముందుకు వెళుతున్న తరుణంలో నాయకులు కార్యకర్తలు అదినాయకుడి వెంట నిస్వార్ధంగా బలంగా నిలబడాలని బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ సూచనలు, సలహాలతో రెట్టించిన ఉత్సాహంతో మరింత బలంగా పనిచేస్తాం అని వాసగిరి మణికంఠ పేర్కొన్నారు.