జనసేన కార్యకర్త సత్యనారాయణను పరామర్శించిన వీరఘట్టం జనసేన నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం, పాపంపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పొట్నూరు సత్యనారాయణ ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్ళగా, అక్కడ కరెఒటు షాక్ తగిలి తన రెండు మోచేతులు కోల్పోయారు. అతను పాపంపేట గ్రామం వచ్చారని తెలిసి పాలకొండ నియోజక వర్గం నాయకులు బి.పి.నాయుడు, అల్లు సాయిరామ్ కుమార్, మత్స.పుండరీకం, ప్రశాంత్, జనసేన జానీ, జామి అనిల్, హైదరాబాద్ జనసేన పార్టీ నాయకులు వెంకటేష్ వెళ్లి పలకరించి, వారి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం బి.వి.ఏ. నాయుడు 5000 రూపాయలు, అల్లు సాయిరాం కుమార్ 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించి మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు. బి.పి.నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండి ఉంటే యువత వలసలు వెళ్ళవలసి వచ్చేది కాదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వలసల జీవనానికి ముగిఒపు పలకాలంటే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, దీనికి యువత రాజకీయాలలోకి రావాలని మీ మీ కుటుంబ సభ్యులను జనసైనికులుగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపంపేట గ్రామానికి చెందిన జనసైనికులు శ్రీనివాసరావు, అనిల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలంటే 9441062293 కి ఫోన్ పే, గూగుల్ పే కి చేయాలని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స.పుండరీకం తెలిపారు.