మహిళా కమిషన్ ఎక్కడా అని ప్రశ్నించిన వీరఘట్టం జనసేన నాయకులు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం జనసేన పార్టీ జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి మహిళా కమిషన్ ఉన్నారా లేదా అనేది నాకు సందేహం? ఎందుకు అంటే మా మన్యం జిల్లాలో ఈ సంవత్సరం 26 సంత్సరాల మహిళ పైన లైంగిక దాడి చేశారు. అప్పుడు ఈ మహిళా కమిషనర్ గానీ దిశ చట్టం గానీ ముందుకు రాలేదు పైగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపమని అనడం యావత్ ప్రపంచం మహిళా లోకాన్ని మాతృమూర్తుల అవమానించడం కాదా మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఎక్కడ దిశ చట్టం ఎక్కడ అని జనసేన జానీ ఇలాంటి గవర్నమెంట్ జనంకోసం నిరంతరం ఆలోచించే పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడం ఏంటి నిలదీసిన జనసేన జానీ. మత్స పుండరీకం మాట్లాడుతూ 2021లో మహిళలపై నేరాలకు సంబంధించి 17736 కేసులు నమోదయ్యాయి. రిపోర్టు చేయని మరియు నమోదు కాని కేసులను కలుపుకొంటె సంఖ్య చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏపీ గవర్నమెంట్ ఎక్కడ అని నీలాదీసిన మత్స పుండరీకం ఈయొక్క కార్యక్రమంలో కర్నేని సాయి పవన్, వావిలపల్లి భూషణ్, సొండి సుమన్, దూసి ప్రణీత్, సొండి సుమన్, బొమ్మాళి వినోద్ పాల్గొన్నారు.