మహాత్ముడికి ఘన నివాళులర్పించిన వీరఘట్టం జనసేన

పాలకొండ నియోజకవర్గం: పాలకొండ జనసేన నాయకులు గిరిజన నేత మాజీ జెడ్.పి.టి.సి నిమ్మల నిబ్రమ్ ఆదేశాలు మేరకు వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా సోమవారం సంత నర్సిపురం స్కూల్ ఆవరహానలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం గ్రామంలో రోడ్ కి ఇరువైపుల సుమారు రెండు కిలోమీటర్లు వరుకు మొక్కులు నాటే కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటన చేస్తూ అక్కడ చెట్లు నరక్కుంటూ వెళ్లిపోతున్నారు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం జనసేన పార్టీ తీసుకుంటుంది అని మానవ మనుగడకు మొక్కలు నాటడం ఎంత అవసరమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది జరగాలంటే గాజు గ్లాస్ పై ఓటు చాలా అవసరం అని, 2024 లో జగన్ ప్రభుత్వం ఇంటికి జగన్ జైలు కి వెళ్లడం కాయం అని కచ్చితంగా 2024 జనసేన పార్టీ టీడీపీ సమూక్తంగా ప్రభుత్వంని స్థాపించడం జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయుకులు మత్స పుండరికం, కోడి వెంకట్ నాయుడు, యంగ్ స్టార్స్ కర్నెని సాయిపవన్, పండు, చరణ్, అనిల్ సాయి, అనిల్ ప్రతాప్ స్థానిక జనసైనికులు కార్తీక్ నాయుకులు పాల్గొన్నారు.