అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో వీరమహిళా సమావేశం
అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు అధ్యక్షతన జరిగిన వీరమహిళా సమావేశంలో.. వీరమహిళా విభాగం రాష్ట్ర నాయకులు శ్రీమతి శరణి, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి కిరణ్ ప్రసాద్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్వొకేట్ కరణం కళావతి పాల్గొన్నారు. మహిళలు కోసం జనసేన ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సందర్బంగా వారు వివరించారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలను ఖండించారు. ఈ సందర్భంగా మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరమహిళ నాయకులను, స్థానిక వీరమహిళలను పరుచూరి భాస్కరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీరమహిళా నాయకులు దొండా కుసుమ, చైతన్య మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-08-at-3.56.06-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-08-at-3.56.18-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-08-at-3.56.18-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-08-at-3.56.17-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-08-at-3.56.08-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-08-at-3.56.07-PM-1-1024x576.jpeg)