తెలంగాణా ఉద్యమకారుల ఆత్మగౌరవ శాంతిదీక్షకు వేముల కార్తీక్ మద్దతు

కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోరుతూ కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ (అమరుల వీరుల ప్రాంగణం) వద్ద సోమవారం స్థానిక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ ఎం డి మంజూరు ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమకారుల ఆత్మగౌరవ శాంతిదీక్షకు మద్దతు తెలియచేసిన జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తీక్.. అలాగే వారు మాట్లాడుతూ వారి తండ్రి వేముల సూర్యనారాయణ గారు 1969 లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో దస్తగిరి రామచందర్ గారు పోలీసులు తూటాలకి బలి అయినప్పుడు తృటిలో ప్రాణాపాయం నుండి బయట పడి వరంగల్ సెంట్రల్ జైల్ కు పంపిన సంఘటన, 2001లో కొత్తగూడెం నియోజకవర్గంలో మొదట టి.ఆర్.ఎస్ జెండా పట్టుకుని పార్టీని అభివృద్ధి చేయడానికి ఆయన పడిన కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ కారులు తమ ఇంట్లో వ్యక్తులతో సమానంగా బావిస్తానని వారు ఎప్పుడు పిలిచినా జనసేన పార్టీ తరుపున అండగా ఉంటాం అని తెలియచేశారు. అలాగే ఉద్యమకారులు చేస్తున్న దీక్షని నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ కార్యక్రమములో కొత్తగూడెం జనసేన టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి అనిత్, బాలకృష్ణ, పాల్వంచ మండలం జనసేన జనరల్ సెక్రటరీ దేవా గౌడ్, రామిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.