జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు విజయవంతం చేయాలని వేముల వినయ్ కుమార్ పిలుపు

మధిర నియోజకవర్గ విద్యార్ధి విభాగ నాయకులు వేముల వినయ్ కుమార్ సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ది .20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి నమోదు చేసుకోనివారు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవలన మధిర నియోజక వర్గ విద్యార్థి విభాగ నాయకులు వేముల వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. అలానే నియోజకవర్గాలలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకు కూడా తెలియజేయవలసినదిగా కోరుతున్నాం. దాదాపు లక్షమంది పైగా సభ్యత్వాలు తీసుకున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో పార్టీ నీ బలోపేతం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం అని అన్నారు. అంతేకాకుండా యువత ప్రమాదవశాత్తూ చాలా మంది చనిపోతున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన కోసం క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టారు.క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి రూ.5లక్షల ప్రమాద బీమా, ఒకవేళ హాస్పిటల్ లో చేరితే రూ.50 వేలు కలిపిస్తున్నట్లు ప్రకటించారు. క్రియాశీలక సభ్యత్వం కోసం రూ:500 చెలించాల్సి ఉంటుంది. సభ్యత్వం తీసుకున్నవారికి రాబోయే రోజుల్లో శిక్షణ ఇవ్వడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అనేక కార్య్రమాలు నిర్వహించి జనసైనికుల్లో బరోసా నింపుతామని తెలియజేశారు.క్రియాశీలక సభ్యత్వం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.