రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన వైస్సార్సీపీ కార్యకర్తలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో ఈదరాడ గ్రామం నుంచి నక్క రామారావు సమక్షంలో వైస్సార్సీపీ కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం సీట్ జనసేనకి కేటాయించిన సందర్బంగా ఆనందంతో సోమవారం రాజేశ్వరరావు ఇంటికి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రాజేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజోలు సీటు జనసేనకి ప్రకటించిన సందర్భంగా చాలా గ్రామాల నుండి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మీరు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు అభినందిస్తూ వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుంది మీ అందరికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబుగారు అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-29-at-8.06.58-PM-1-1024x576.jpeg)