జనసేన పార్టీ విజయమే నా ధ్యేయం: పత్తిపాటి బాలాజీ

తెలంగాణ, నాగార్జునసాగర్ మాచర్లకు చెందిన పత్తిపాటి బాలాజీ సుమారు ఒక సంవత్సరం కాలం నుండి జనసేన పార్టీ విజయమే నా ధ్యేయం అని లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఊరు తిరుగుతూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2023 – ఎన్నికలు ఉండడం వలన తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తిరుగుటకు సిద్ధమై తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తో సంప్రదించి మొట్టమొదటిగా కూకట్పల్లి నియోజకవర్గంతో తన ప్రచారము మొదలుపెట్టి నియోజకవర్గ నాయకులను కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు కలిగినిడి ప్రసాద్, అంజి మరికొంత మంది నాయకులతో కలిసి ప్రచారం కే.పి.హెచ్.బి మరియు ఫతేనగర్ డివిజన్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజలకు తెలియపరుస్తూ ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో తన ప్రచార వాహనాన్ని చూసి తన వద్దకు వచ్చిన సామాన్య ప్రజలు తనతో సెల్ఫీలు దిగుతూ ఈసారి కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకే తమ ఓటు అని భరోసా ఇచ్చారని అన్నారు.