కౌలు రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన విడివాడ రామచంద్ర రావు
తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, ఇరగవరం గ్రామంలో కౌలు రైతు వీరవల్లి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించడం జరిగింది. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులును తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి విడివాడ రామచంద్ర రావు, జనసేన పార్టీ నాయకులు ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు ఆకేటి కాశీ, ఇరగవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించి.. ఓదార్పులో పవన్ కళ్యాణ్ గారు మరణించిన కౌలు రైతులకు అందించే లక్షరూపాయలు త్వరలో అందజేయడం జరిగుతుదని.. అదే విధంగా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని విడివాడ రామచంద్ర రావు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిక్కాల వేణు, పంతం నానాజీ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-12-at-9.21.32-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-12-at-9.21.32-PM-1-1024x768.jpeg)