అగ్నిప్రమాద బాధితునికి అండగా నిలిచిన విడివాడ
తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, ఈడూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బింకం నాగేశ్వరరావు నరసింహారావు కుటుంబాన్ని తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు పరామర్శించి తన వంతు సాయంగా 2000 రూపాయలు నగదు, రెండు దుప్పట్లు, ఒక బియ్యం బస్తా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాదు, ఈడూరు గ్రామం శ్రీనివాసరాజు, కృష్ణ సుబ్బారావు, మరియు జనసేన, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-18-at-8.09.25-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-18-at-8.09.25-PM-1-1024x576.jpeg)