లక్కిపుట్ గ్రామంలో జాగరపు పవన్ పర్యటన
అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం లక్కిపుట్ గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాగరపు పవన్ బుధవారం పర్యటించారు.. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి యొక్క సమస్యలను తెలుపుతూ మంచినీరు, డ్రైనేజీ, పిల్లలు చదువుకునే పాఠశాల గది ఇలా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. మా గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగటం లేదని గ్రామస్తులు వారి యొక్క సమస్యను జనసేన పార్టీ నాయకులకు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మన దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా మన గిరిజన ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందటం లేదు. ఒక విద్యారంగం, వైద్య రంగం ఇలా చెప్పుకొని పోతే మరి అనేక రకమైన సమస్యలలో గిరిజన బిడ్డలు ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2024లో మన జనసేన పార్టీ అధికారంలో వచ్చాక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు న్యాయం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పి. ప్రశాంత్ కుమార్ ఎం. మురళి, పి రాజు, కే. కామరాజు, పి.నాగరాజు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-31-at-3.43.21-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-31-at-3.43.22-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-31-at-3.43.23-PM-1024x461.jpeg)