పాలవలస గ్రామంలో పర్యటించిన జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, పాలవలస గ్రామంలో పర్యటించిన జాగరపు పవన్ కుమార్ గ్రామస్తులతో రాలి పాలవలస నుండి బండారి వరకూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలు 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోనికి వస్తే మన గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇస్తే మన గిరిజన బతుకులు మారతాయి అన్నారు. అలాగే గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మంచినీరు సాగునీరు, డ్రైనేజీ, అంగన్వాడి బిల్డింగ్, పాఠశాల గది మొదలైన సమస్యలను గ్రామస్తులు వివరించడం జరిగింది. తప్పకుండా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా చేసి పెడతామని పవన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు, నాగరాజు, రాజు, మల్లేష్, శ్రీను, సోమన్న, మల్లన్న పాల్గొనడం జరిగింది.