పెద్ద గొంది గ్రామంలో జాగరపు పవన్ కుమార్ పర్యటన

పాడేరు నియోజకవర్గం: పెదబయలు మండలం, పెద్ద కోడపల్లి పంచాయతీ పరిదిలో పెద్ద గొంది గ్రామంలో జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ జాగరపు పవన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుస్తుంది కావున మీరందరూ ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. అలాగే ఆ గ్రామంలో మంచినీటి రోడ్డు కొన్ని సమస్యలు తెలుసుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్రామస్తులకు తెలియపరిచారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఆ గ్రామస్తులకు బాగా ఆకట్టుకుంది కావున గ్రామస్తులందరూ ముక్తకంఠంగా ఉండి జనసేన పార్టీకి అండగా ఉంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జే కళ్యాణ్, కొర జీవన్ కుమార్, రవికుమార్ బుజ్జిబాబు పాల్గొన్నారు.