వైకాపా నేతల కారణంగా విహారి ఆంధ్రా క్రికెట్ టీమ్‌ని వీడారు

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: వైకాపా నేతల కారణంగానే క్రికెటర్‌ హనుమ విహార్‌ ఆంధ్రప్రదేశ్‌ జట్టు నుంచి వైదొలగారని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రీడలపై కూడా వైసీపీ దౌర్బాగ్య రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రతిభావంతుడైన క్రికెటర్‌ హనుమ విహారిని వేధించారని, ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేముంటుందని అన్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియోషన్‌ క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం బాధాకరమన్నారు. వైకాపా నాయకులు అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను అన్నివిధాలా నాశనం చేశారని దుయ్యబట్టారు.