త్వరలో గ్రామ కమిటీలు

అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం, ఇర్లపల్లి గ్రామ జనసైనికులను రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్ మరియు నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, త్వరలో ప్రతీ గ్రామం తిరిగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేస్తామని అన్నారు. మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కొణతం శ్రీనివాస్ గ్రామస్తులు మిర్తివాడ శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు, సారపు వీరబాబు జనసైనికులు పాల్గొన్నారు.