పాచిలవలస గ్రామంలో పల్లె పల్లెకు జనసేన

గజపతినగరం: దత్తిరాజేరు మండలం, పాచిలవలస గ్రామంలో బుధవారం పల్లె పల్లెకు జనసేన కార్యక్రమాన్ని ఆ గ్రామ సుంకరి సత్యం, సుంకరి శివ, కోట్ల శ్రీను, సుమల గురునాయుడు గణేష్ దుప్పాడ కుమార్ గుసిడి సూర్యనాయడు మరియు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ఇంటింటికి తెలియజేస్తూ ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ ర్యాలీలో జనసైనికులతో పాటు వందల సంఖ్యలో పాచిలవలస గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలో జనసేన నాయకులు దీనికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ నూతన రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యురాలు మరియు మాజీమంత్రి వర్యులు శ్రీమతి పడాల అరుణ పాల్గొనడం జరిగింది. ర్యాలీ అనంతరం జనసైనికులను గ్రామస్తులను ఉద్దేశించి పడాల అరుణ మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి ప్రభుత్వ విధానాలను ఎండ కొడుతూ రేపు రాబోయే ఎలక్షన్స్ లో జనసేన పార్టీని గెలిపించమని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల శరత్, గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్ దత్తిరాజేరు మండల అద్యక్షలు చప్ప అప్పారావు, ప్రచార కార్య నిర్వహణ సభ్యలు మామిడి దుర్గాప్రసాద్, చీపురుపల్లి ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ మరియు నాయకులు త్రివేది ప్రవీణ్ రామకృష్ణ రమేష్ మురళి రామారావు గ్రామ ప్రజలు వీరమహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ మన రాష్టాన్ని అప్పుల్లోకి నెట్టిన విషయం తెలిసినదే కనుక 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేవిధంగా మనందరం కలసి పనిచేయాలని అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ని సిఎంగా చూడాలని అందరిని కోరుకుంటున్నామని అన్నారు.