తోకవలస గ్రామంలో బురద గెడ్డలో మట్టి తవ్వి మంచి నీరు తాగుతున్న గ్రామస్తులు – వివరాలు తెలుసుకున్న జనసేన నాయకులు

అరకు నియోజకవర్గం సిరాగం పంచాయతీ తోకవలస గ్రామంలో కుళాయి పాడైపోయి తాగడానికి మంచినీరు లేక బురద గెడ్డలో మట్టి తవ్వి నీరు తీసుకెళ్తున్న తోకవలస గ్రామ మహిళలతో జనసేనపార్టీ నాయకులు, గ్రామంలో మంచి నీటి సమస్య ఉందని తెలిసి వెంటనే గ్రామంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గ నాయకులు మాదాసు శ్రీ రాములు మాట్లాడుతూ మహిళలతో కలిసి గ్రామంలో బురద మట్టి తవ్వి నీరు మోస్తున్న మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ గెడ్డలో ఆ గ్రామ మహిళలతో మాట్లాడుతూ… శీతాకాలంలో మంచి నీటి సమస్య ఉందంటే ఎండాకాలంలో చుక్క మంచి నీరు కూడా ఉండదు. సచివాలయంలో పిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదు అధికారులకు నాయకులకు చెప్పిన ఎవరు స్పందించడం లేదు. మంచినీరు కోసం రోజు అర కిలోమీటరు దూరం వచ్చి తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు మంచినీటి కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాం అంటున్నారు కానీ నియోజకవర్గంలో మంచి నీటి సమస్య ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి పల్లెలో మంచినీటి సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు గురికాక తప్పదు గనుక అధికారులు వెంటనే స్పందించాలి లేని పక్షాన ఖాళీ బిందెలతో MPDO కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొనెడి లక్ష్మణ్ రావు, అరకు వ్యాలీ మండల నాయకులు అల్లంగి రామకృష్ణ, గ్రామస్తులు మరియు మహిళలు పాల్గొన్నారు.