రైతులను దుశ్శాలువ తో సన్మానించిన వినుత కోటా

శ్రీకాళహస్తి: పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు గ్రామంలో రైతులను దుశ్శాలువ తో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ ఏ అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. రైతులందరూ ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను బాధ్యతా యుతంగా రైతుల అభున్నతి కొరకు, పేద ప్రజల అభ్యున్నతి కొరకు బాధ్యతగా ఉపయోగిస్తామని తెలిపారు. రైతు కళ్ళల్లో ఆనందం చూసిన రోజే నిజమైన రైతు దినోత్సవముగా భావించాలని తెలిపారు. కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతామన్న ముఖ్యమంత్రి మరిచిపోయారని రైతుకు తెలిపారు. ఉచిత బోర్లు వేయిస్తామని మాట తప్పారని అన్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదిస్తామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, జిల్లా కార్యదర్శి పద్మజ, నాయకులు నితీష్ కుమార్, భాగ్యలక్ష్మి, చందు చౌదరి, వెంకటేష్ , గంగయ్య తదితరులు పాల్గొన్నారు.