నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా మంగలపురిలో పర్యటించిన వినుత కోటా
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి మండలం, మంగలపురి పంచాయతీలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలను సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రజలు ప్రధానంగా స్ట్రీట్ లైట్ లు, త్రాగు నీరు, ఇళ్ళ పట్టాలు, సీసీ రోడ్లు సమస్యలను వినుత గారికి తెలియజేశారు. సమస్యలను మండల అధికారులకు, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ.. ప్రజల తరఫున పోరాడుతుందని శ్రీమతి వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు గణేష్, లక్ష్మణ్ యాదవ్, తేజ, రూపేష్, సతీష్, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-3.13.18-AM-1-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-3.13.18-AM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-3.13.17-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-3.13.19-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-3.13.20-AM.jpeg)