డి.యస్.పి ఉమా మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వినుత కోటా

శ్రీకాళహస్తి డి.యస్.పి. గా నూతనంగా నియమితులైన ఉమా మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. ఎస్.డి.పి.ఓ పరిధిలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలపైన పోలీసులు బలవంతపు బైండ్ ఓవర్ కేసులు, రౌడీ షీటర్ కేసులు నమోదు చేస్తామని బయబ్రాంతులకి గురి చేస్తున్నారని తెలియడంతో డి.యస్.పిని కలిసి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి బలవంతపు తప్పుడు కేసులు నమోదు చేస్తామని కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం సరికాదని, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కోసం నియోజకవర్గంలో జనసేన పార్టీ చేసే కార్యక్రమాలకు నిష్పక్షపాతంగా సహకరించాలని కోరడం జరిగింది.