విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించాలి: అంజూరు చక్రధర్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆదివారం జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల అందరికి తెలిసేలా సోషల్ మీడియా క్యాంపెయిన్ లో భాగంగా రెండవరోజు ప్లకార్డులతో నిరసన తెలియజేస్తు తిరుపతి ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తిని వారి ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ నిరసన తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని గట్టిగా వినిపించాలంటూ చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తిని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.