విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో హోరెత్తిన హిందూపురం

జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ అదేశాలమేరకు విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదాంతో హిందూపురం ఎంపీ శ్రీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ లో మీరు గట్టిగా మీ వాణి వినిపించాలని హిందూపురం అంబేద్కర్ సర్కిల్ లో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 32 మంది బలిదనాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఆంధ్రుడు పై ఉందని, ఆంద్రప్రదేశ్ లోని 25 మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో గట్టిగా పోరాడాలని హిందూపురం జనసేన పార్టీ తరుపున కొరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, మల్లెపూల మధు, నిమ్మకాయల రాము, చక్రవర్తి, M.M మంజు, గాజుల నాగభూషణం, ప్రభు దాస్, అంబేద్కర్ నగర్ శివ, మనోహర్, హనుమంతు, రామంజి, పవన్, విజయ్, లింగరాజు, గోపీనాథ్, శ్రీనిధి, ప్రశాంత్, నాగరాజు, వీరమహిళ మణి ప్రియ మరియు జనసైనికులు పాల్గొన్నారు.