విష్ణుమూర్తి కుటుం బసభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం: ఇటీవల తిరుమల సైకిల్ యాత్ర ఆటో ప్రమాదంలో మృతి చెందిన రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామవాసి ఉల్లి విష్ణుమూర్తి (పుల్లయ్య) పెద కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించి మనోధైర్యం చెప్పారు. వీరి వెంట జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, చిట్టిప్రోలు సత్తిబాబు, నరేంద్రపురం గ్రామ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.