పాశర్లపూడి లంక గ్రామంలో జగనన్న కాలనీ సందర్శన

పి.గన్నవరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆదేశాల మేరకు వసీపి ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో భారీ అవినీతి చోటుచేసుకుని ప్రజలను మోసం చేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచుట కొరకు పాశర్లపూడి లంక గ్రామంలో జనసేన పార్టీ మామిడికుదురు మండల అధ్యక్షులు జె.ఎస్.ఆర్ ఆధ్వర్యంలో వీడియోలు ఫోటోలు రూపంలో పార్టీ ఆఫీస్ కి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపిటిసి చెరుకూరి పార్వతీ సత్తిబాబు గ్రామశాఖ అధ్యక్షులు తెలగారెడ్డి యేసు, నాయకులు కంకిపాటి నరసింహారావు, మద్దింశెట్టి బుజ్జి, కొమ్ముల కొండలరావు, తుండూరి బుజ్జి, మంద గాంధీ, అడబాల చిన్ని, కొమ్మల రాము, కాట్రేనుపాడు నాగేంద్ర, తులా ఉమా, వీధి సత్తిబాబు రవణం సాయి, మంచాల వేణు, మేడిది బాలాజీ, బొరుసు బాబీ, నాని స్థానిక తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.