రావాడ గ్రామంలో లోకం మాధవి గడపగడపకి పర్యటన

నెల్లిమర్ల: మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా భోగాపురం మండలంలోని చిన రావాడ గ్రామంలో శ్రీమతి లోకం మాధవి గడపగడపకి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ దుష్ట పాలనని ప్రాలద్రోలి ప్రజా పాలనకు నాంది పలకాలని కోరారు. ఎన్నికల ముందు వచ్చి చేయలేని వాగ్దానాలు ఇచ్చినందువలనే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటునబడిందని ప్రజలకి తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న చిన రావాడకి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా దౌర్భాగ్యం అని ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు, చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఉపాధ్యాయులు కూడా లేరు అని, ఇన్ని ప్రభుత్వాలు మారిన గ్రామానికి వచ్చే రోడ్డు ఇప్పటివరకు అధికారులు పెడచెవిన పెట్టారు అని, పంచాయతీ నిధులని అడ్డగోలుగా నొక్కేసి ప్రజలను వైసీపీ నాయకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు, తాను అధికారంలోకి వస్తే రావాడ స్థితిగతులను మార్చే బాధ్యత తాను తీసుకుంటానని, ప్రతి ఇంటికి కులాయి తెప్పించే చొరవ తాను తీసుకుంటానని లోకం మాధవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ భోగాపురం మండల అధ్యక్షులు వందనాల రమణ, నక్క శ్రీను, మణి, లక్ష్మణ్, సంతోష్, వార్డు మెంబర్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.