జనసేన ఆధ్వర్యంలో వాలీ బాల్ టోర్నమెంట్

చీపురుపల్లి నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని శుక్రవారం గుర్ల మండలం, కెల్లలో జనసేన ఆధ్వర్యంలో వాలీ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ ని జనసేన సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు ప్రారంభించారు. కెల్ల జెడ్ పీహై స్కూల్ ఆవరణలో మెగా టోర్నమెంట్ హారహోరీగా సాగింది. చీపురుపల్లి నియోజకవర్గం నుండి 22 జట్లు ఈ టోర్నమెంట్ పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో గుర్ల మండల జనసేన అధ్యక్షులు యడ్ల సంతోష్, గుర్ల మండల జనసేన ఉపాధ్యక్షులు మరియు ఈ టోర్నమెంట్ స్పాన్సర్ బూసరి నూకరాజు, చీపురుపల్లి మండల జనసేన అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాస్ రావు, కెల్ల జడ్పీహెచ్ హై స్కూల్ చైర్మన్, జనసైనికులు పవన్న అభిమానులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.