పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం జనసేన పార్టీ నాయకులు బాబు పాలూరు మరియు మండల అధ్యక్షురాలు శ్రీమతి ఆగూరు మణి జనసైనికులు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు పాకలపాటి రఘువర్మ ఓటు వేసి శాసనమండలికి ఎన్నుకోవాలని ఉపాధ్యాయులను కలుసుకొని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షురాలు శ్రీమతి ఆగూరు మణి, మన్యం జిల్లా డి.ఆర్.సి మెంబర్ శ్రీమతి బోనెల గోవిందమ్మ, కార్యనిర్వహణ కార్యదర్శి గొర్లె చంటి, సీనియర్ నాయకులు రాజాన రాంబాబు, బంటు శిరీష్, అల్లు సాయి, పవన్ శర్మ, ఆగూరు శ్రీను, రౌతు బాలు, కనకరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment