మార్పు కోసం గ్లాసు గుర్తుకి ఓటు వేయండి

శ్రీకాళహస్తి, 61 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం, బహదూర్ పేట (కుమ్మర వీధి, కుందేటి వారి వీధి)లో నాయకులు నక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వినుతకి జనసైనికులు పూల వర్షంతో స్వాగతం పలికారు. పట్టణంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటాని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ కాలువల సమస్య, చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఇంఛార్జి తోట గణేష్, నాయకులు నక్కా ప్రసాద్, రఫీ, అఖిల్ సాయి, ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ , కవిత, లక్ష్మి, గాయత్రి, రాజ్య లక్ష్మి, పుష్ప, శారద ,దుర్గ, పేట చంద్ర శేఖర్, రాజేష్, సురేష్, హేమంత్, ఉదయ్, చిన్న మునయ్య, వంశీ, నితీష్, జనసైనికులు దినేష్ తదితరులు పాల్గొన్నారు.