ఓటర్ జాబితాపై అవగాహన సదస్సు

సత్తెనపల్లి: ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన ఎలక్షన్ ఓటర్ లిస్ట్ పై అవగాహన సదస్సును పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేటలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఐదు జిల్లాల ఎలక్షన్ కమిటీ ఆఫీసర్లు నరసరావుపేట కలెక్టర్ ఆఫీసులో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుండి నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్ పాల్గొనడం జరిగినది.