ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విజయవంతం

రాజానగరం నియోజకవర్గం: 2024లో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవెయ్యాలనే ధృడ సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్న రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ నేత్రుత్వంలో రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు చేపట్టిన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసారు. పూర్తి చేసిన ఈ డేటాను శ్రీకృష్ణపట్నం గ్రామ జనసేన నాయకులు జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి అందజేసారు. అనంతరం బత్తుల వెంకటలక్ష్మి ఓటర్ లిస్ట్ డేటాను పరిశీలించారు.