వరద బాధితులను అండగా వి.ఆర్.పురం జనసేన
వి.ఆర్.పురం మండలం జనసేన పార్టీ తరఫున శనివారం వరద ముంపు బాధితులైన గర్భిణీ స్త్రీలకు, పిల్లతల్లులకు మరియు వృద్ధులకు ఫ్రూట్స్, బ్రెడ్, మిల్క్ మరియు బిస్కెట్స్ తో కూడిన కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి జనసైనికుడికి ధన్యవాదములు తెలియజేశారు. పార్టీ తరపున ప్రతి పంచాయతీలో ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-30-at-8.18.47-PM-1024x690.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-30-at-8.18.48-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-30-at-8.18.49-PM-1024x551.jpeg)