జనసేన మద్దతు కోరిన వీ.ఆర్.ఏలు

గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వి.ఆర్.ఎలు జీతాలు పెంపు మరియు ఇతర డిమాండ్ లతో దీక్షలు చేస్తున్నారు.. దీనిలో భాగంగా శనివారం పెనుగొండ మండల వి.ఆర్.ఎలు అందరూ.. పెనుగొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల బాబులుని కలిసి వినతి పత్రం ఇచ్చి జనసేన పార్టీ మద్దతు కోరడం జరిగింది. జగన్ రెడ్డి పాదయాత్రలో వి.ఆర్.ఎలకు 21,000 వరకూ జీతం పెచుతామని ఇచ్చిన హామి నెరవేర్చలేదని, ఇచ్చిన డి.ఎ రికవరి ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, డి.ఎ తో కూడిన వేతనం లాంటి సమస్యలను వి.ఆర్.ఎలు బాబులు దృష్టి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కంబాల బాబులు అన్నివిధాలా వి.ఆర్.ఎలకు జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని హామి ఇచ్చారు. ఈ మేరకు వి.ఆర్.ఎలు హర్షం వ్యక్తం చేసారు.