వాల్తేరు వీరయ్య శతదినోత్సవ వేడుకలు

చీపురుపల్లి, ఆంధ్రప్రదేశ్ మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా శతదినోత్సవం, ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక వంశీ థియేటర్ లో 100 రోజులు ఆడిన సందర్బంగా అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆధ్వర్యంలో వైభవంగా జరపబడుతున్నా మెగా వేడుక కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ వెళ్ళడంతో పాటుగా అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రవణం స్వామి నాయుడుతో కలిసి సినిమా చూడటం అనేది చాలా సంతోషం కలిగింది అని రవణం స్వామి నాయుడుతో జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉండే గొప్ప మనసున్న మహా గొప్ప మనిషి మరి రాబోయే 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మెగా అభిమాన సంఘ నాయుకులు, మెగా అభిమానులు కష్టపడాలి అని పిలుపును ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మెగా అభిమానులు, జనసేన నాయుకులు, హిందూపురం జనసేన నాయుకులు భవాని రవికుమార్, భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్, విజయనగరం జనసేన నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్ రావు, చీపురుపల్లి జనసేన నాయకులు రేగిడి లక్ష్మణ్ టైక్వాండో శ్రీను పాల్గొన్నారు.