వాటర్ ట్యాంక్ లీకేజీ సమస్య త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఏలూరు జిల్లా, టి. నరసాపురం మండలం, బొర్రంపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ లీకేజీ గురించి, బురద నీరు సమస్య గురించి గ్రామస్తులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి తెలియపరచగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమణుగు రవి, జనసేన మండల్ ప్రెసిడెంట్ అడపా నాగరాజు, టిడిపి ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment