జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వాటర్ ట్యాంకర్

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు లో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బందిపడుతుండడంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచి నీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం అంతర్వేదికర గ్రామం(దారి కోడప)లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్న జనసేన నాయకులు బళ్ళ శ్రీను అందించిన (ట్రాక్టర్ డిజల్) ఖర్చులతో జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది అని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.