మేము సైతం రిలే నిరాహారదీక్షకు పోలవరం జనసేన మద్దతు

పోలవరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి అని అధికారికంగా ప్రకటించిన సందర్భంగా శుక్రవారం జాతీయ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ “బాబుతో నేను” ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహారదీక్షలో భాగంగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం టౌన్ లో తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసిన రిలే నిరాహార నిరసన దీక్ష కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం టౌన్ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి జనసేన పార్టీ టిడిపి పార్టీ కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుండి విముక్తి కలిగించడమే మా లక్ష్యం అని తెలియజేయడం జరిగింది.. ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు పోలవరం ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ కి మరియు టిడిపి కార్యకర్తలకు, నాయకులకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడి పిండి సుబ్రహ్మణ్యం, మేకల తేజ, సంకు మధుబాబు, కొట్టు ఏడుకొండలు, కూచుమంచి శ్రీనివాసు, పడిందల విజయ్, సంకు బాలు, ఆకాష్, కిషోర్, అభిరామ్, నాగేంద్ర మరియు జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.